సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎన్సీఎల్ పరిశ్రమలో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సిమెంట్ తరలిస్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 2వేల 600 సిమెంట్ బ్యాగులు లారీల ద్వారా కొండపల్లి, చెరువు మాదారం పరిసర ప్రాంతాలకు తరలించారని డిఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు లక్షల 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: రోడ్డుపై యువతుల హల్చల్