సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద 69, 70, 71 డీబీఎంల ద్వారా జిల్లాలోని ప్రవేశించిన గోదావరి జలాలకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలు చల్లారు. నీటి సరఫరా విషయంలో ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినా పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లోని అధికారుల సహాయం తీసుకోవాలని ఎస్సారెస్పీ అధికారులకు సూచించారు.
జిల్లాలో 69,70,71 కాలువల ద్వారా 554 చెరువులను నింపుతామని ఎస్సారెస్పీ కెనాల్ ఎస్ఈ సుధీర్ బాబు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు అవసరం ఉన్నంత వరకు నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్, తిరుమలగిరి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్