సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. కిరణ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. అప్పటికే అతను మరణించాడని తెలిపారు. ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై దాడికి దిగారు. వారి నిర్లక్ష్యం వల్లే కిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై దాడికి నిరసనగా వైద్య సిబ్బంది ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. తక్షణమే తమపై దాడి చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
- ఇదీ చూడండి కేసులు, రికవరీలు ఈ 5 రాష్ట్రాల్లోనే అధికం