ETV Bharat / state

గొర్రెకు రూ.1000 జరిమానా - గొర్రెకు రూ.1000 జరిమానా

హరితహారం మొక్కలు తిన్నందుకు సూర్యాపేట జిల్లా సూర్యానాయక్​ తండాలో గొర్రెకు జరిమానా వేశారు. రూ.1000 చెల్లించి తీసుకెళ్లాల్సిందిగా యాజమానికి సమాచారం ఇచ్చారు.

గొర్రెకు రూ.1000 జరిమానా
author img

By

Published : Sep 24, 2019, 9:52 AM IST

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సూర్యానాయక్​ తండాలో గొర్రెకు జరిమానా వేశారు అధికారులు. హరితహారం మొక్కలు తిన్నందుకు రూ.1000 జరిమానా విధించారు. అనంతరం యాజమానికి సమాచారం ఇచ్చి.. గొర్రెను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అధికారులకు డబ్బులు చెల్లించి గొర్రెను ఇంటికి తీసుకెళ్లాడు యాజమాని.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సూర్యానాయక్​ తండాలో గొర్రెకు జరిమానా వేశారు అధికారులు. హరితహారం మొక్కలు తిన్నందుకు రూ.1000 జరిమానా విధించారు. అనంతరం యాజమానికి సమాచారం ఇచ్చి.. గొర్రెను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అధికారులకు డబ్బులు చెల్లించి గొర్రెను ఇంటికి తీసుకెళ్లాడు యాజమాని.

ఇవీ చూడండి: మేకకు రెండువేలు జరిమానా... ఎందుకంటే?

Intro:ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు.
30 రోజుల ప్రణాళికలో భాగంగా తీసిన ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు జారి పడి మట్ట ధర్మతేజ అనే మూడు ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం గనిబోయిన గుంపు గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వర్లు, వెంకటమ్మ దంపతులకు ఇద్దరి ఆడపిల్లల తర్వాత ధర్మ తేజ మూడో సంతానం. తండ్రి వెంకటేశ్వర్లు కూలి పని చేస్తుంటాడు. వెంకటేశ్వర్లు ఎదో పని నిమిత్తం ఊరు వెళ్లగా.. బాలుడి సోదరిని లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో తల్లి వద్ద ధర్మ తేజ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటివద్ద ప్రాథమిక పాఠశాల ఆవరణలో తవ్వి ఉంచిన ఇంకుడు గుంత వద్దకు వెళ్లి ధర్మ తేజ ఆడుకుంటుండగా అందులో పడి మృతి చెందాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో వెంకటమ్మ వెతుకులాట ప్రారంభించింది. ఇంకుడు గుంత వద్ద బాలుడు పాదముద్రలు వెంకటమ్మ గమనించింది. వెంటనే గ్రామస్తుల సాయంతో ఇంకుడు గుంతలో కర్రతో గాలించగా ధర్మతేజ మృతదేహం లభించింది. అనంతరం బాలుడి మృతదేహాన్ని గ్రామస్థులు బయటకి తీశారు.


Conclusion:ధర్మతేజ మృతదేహంపై తల్లి వెంకటమ్మ పడి కన్నీరు మున్నీరుగా విలపించింది. పాఠశాల ఆవరణలో తీసిన ఇంకుడు గుంతలో కంకర ,ఇసుక నింపకుండా నిర్లక్ష్యంగా వదిలివేయటం తోనే బాలుడు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఘటనా స్థలానికి ఎస్సైలు ఆనందరాజు, శ్రీకాంత్ ,ఎంపిడిఓ శ్రీనివాసరావు చేరుకొని పరిశీలించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.