ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేటలో అసంపూర్తిగా ఉన్న పనులు, వ్యవసాయ ప్రణాళికపై గ్రామస్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి గజ్వేల్లో సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా మిగిలిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు.. అధికారులకు సహకరించాలని కోరారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన సూచనలు ఆచరణలో పెట్టాలని కలెక్టర్ గ్రామస్థులకు సూచించారు. రెండు గ్రామాలను 14 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని హమీ ఇచ్చారు. ప్రయోగాత్మకంగా రెండు జోన్లలో కూరగాయల సాగును చేపట్టి.. ఫలితాల ఆధారంగా కూరగాయల విస్తీర్ణం పెంచుతామని వెల్లడించారు. గ్రామాభివృద్ధి కమిటీలు క్రీయాశీలకంగా పని చేయాలని.. క్రమం తప్పకుండా సమావేశమై గ్రామాభివృద్ధిపై చర్చించాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: 'ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా.. అల్లర్ల హైదరాబాద్ కావాలా..?'