సిద్దిపేట జిల్లా రాజక్కపేట గ్రామానికి చెందిన బిట్ల లక్ష్మి అనే మహిళ దుబ్బాక బస్టాండ్లో సికింద్రాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బ్యాగును బస్సులో పెట్టి పనిమీద బయటకు వెళ్లి వచ్చేలోపు బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరి వెళ్లిపోయింది. ఆ బ్యాగులో 28వేల నగదు ఉండటం వల్ల ఆమె కంగారుకు గురైంది. ఆ మహిళ ఏడుస్తూ అక్కడే ఉన్న హోంగార్డుకు సమాచారం అందించింది.
అతను వెంటనే మిరుదొడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు బస్సును వెంబడించి బస్సులో ఉన్న ఆ బ్యాగును స్వాధీనం చేసుకొని సంబంధిత మహిళకు అప్పగించారు. దీనికి ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి: కరోనా వైరస్పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం