సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండ్రోజుల నుంచి వేడిగా ఉన్న ప్రాంతమంతా ఉదయం నుంచి చల్లగా మారింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత మోస్తరు జల్లులతో వర్షం కురిసింది.
చలికాల ముగిసే దశలో వేసవి కాలం దగ్గరపడుతుండగా.. ఉన్నట్లుండి ఒక్కసారిగా వర్షం కురవగా ప్రజలంతా పులకరించిపోయి వాతావరణాన్ని ఆహ్లాదిస్తున్నారు.
ఇదీ చూడండి: ఎఫ్డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!