సిద్దిపేట బస్ డిపో ఆవరణలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు దీక్షకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించారు.
ఇదీ చూడండి : "డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి"