సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం నిర్లక్ష్యానికి గురవుతోంది. పట్టణ శివారులోని కరీంనగర్ పాలకేంద్రం వెనకాల సుమారు మూడు వేలకు పైగా మొక్కలు కుప్పగా పడేసి ఉండటాన్ని సీపీఐ నాయకులు గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పట్టణంలోని విద్యుత్ లైన్ల కింద మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు.
హరితహారం మొక్కలను పెంటకుప్పలో పడేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. నాటిన తర్వాత పెరిగిన మొక్కలను కొట్టి వేస్తే జరిమానాలు విధిస్తున్న అధికారులు.. నాటే మొక్కలను వృథా చేయకుండా ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: నగరంలో దుకాణదారుల స్వచ్ఛంద లాక్డౌన్