ETV Bharat / state

దారి పొడుగునా హరితవర్ణం.... పర్యావరణ స్ఫూర్తి తోరణం

author img

By

Published : Aug 11, 2020, 4:09 AM IST

అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపుదలలో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లాలో హరితహారం ఫలాలు కళ్లకు కడుతున్నాయి. పచ్చని చెట్లతో హరితవర్ణం పులుముకున్న రహదారులు పర్యావరణ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సమన్వయం.. అధికారుల కృషితో రాజీవ్ రహదారి పచ్చని తోరణంగా మారి ఆహ్లాదాన్ని పంచుతోంది.

green wall along with siddipet rajeev road
green wall along with siddipet rajeev road
దారి పొడుగునా హరితవర్ణం.... పర్యావరణ స్ఫూర్తి తోరణం

సిద్దిపేటను హైదరాబాద్‌తో అనుసంధానం చేసే రాజీవ్​రహదారి... హరితమయంగా మారింది. ఆకుపచ్చని చెట్లతో జిల్లావాసులతో పాటు రోడ్డుపైవెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది. భాగ్యనగరం నుంచి రామగుండం వరకు 207 కిలోమీటర్లు ఉన్న రహదారి... సిద్దిపేట జిల్లాలో 92 కిలోమీటర్లు ఉంటుంది. ఇది జిల్లాలోని రెండు పురపాలక సంఘాలు, 33గ్రామాల గుండా పోతుంది. ఈ రోడ్డును హరితమయం చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగేళ్లలో గ్రీన్‌వాల్‌గా మార్చారు.

నాలుగేళ్ల కృషికి నిదర్శనం...

అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేసిన మంత్రి హరీశ్​రావు.. 2016లో రాజీవ్ రహదారిపై హరితహారంలో భాగంగా మొక్కలు నాటించారు. రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు పెంచారు. సంరక్షణ బాధ్యతను స్థానిక పంచాయతీలకు, ఉపాధి హమీ విభాగానికి అప్పగించారు. ఏదైనా మొక్క చనిపోతే.. మరో మొక్కను నాటి సంరక్షించారు. నాలుగేళ్లలో మొక్కలు.. చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం రాజీవ్ రహదారికి రెండువైపుల కిలోమీటరుకు 800 చెట్లు ఉండగా... రోడ్డు మధ్యలో రంగు రంగుల పూల మొక్కలు 200లకు పైగా ఉన్నాయి. ఇలా రెండు వైపులా కలిపి 184 కిలోమీటర్ల పచ్చనితోరణం రహదారిపై ఆవిష్కృతమైంది.

ఆహ్లాదం పంచుచున్న ప్రయాణమార్గం...

రాజీవ్ రహదారిని గ్రీన్ వాల్​గా మార్చడంలో ఉపాధి హమీ పథకాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. మొక్కలు నాటడం నుంచి సంరక్షణ వరకు.. రోడ్డు పక్కల పెరిగే పిచ్చి మొక్కలు, పొదల తొలగింపు వంటి పనులను కూలీలతో చేయించారు. దీని వల్ల ఉపాధితో పాటు రోడ్డు హరితమయమైంది. ఇలా ఈ మార్గంలో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ప్రయాణికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలతో వార్తాల్లో నిలిచే రాజీవ్ రహదారి.. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో పచ్చదనంతో కొత్త అనుభూతులను పంచుతోంది. హరితస్ఫూర్తిని రగిలిగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీచూడండి: ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

దారి పొడుగునా హరితవర్ణం.... పర్యావరణ స్ఫూర్తి తోరణం

సిద్దిపేటను హైదరాబాద్‌తో అనుసంధానం చేసే రాజీవ్​రహదారి... హరితమయంగా మారింది. ఆకుపచ్చని చెట్లతో జిల్లావాసులతో పాటు రోడ్డుపైవెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది. భాగ్యనగరం నుంచి రామగుండం వరకు 207 కిలోమీటర్లు ఉన్న రహదారి... సిద్దిపేట జిల్లాలో 92 కిలోమీటర్లు ఉంటుంది. ఇది జిల్లాలోని రెండు పురపాలక సంఘాలు, 33గ్రామాల గుండా పోతుంది. ఈ రోడ్డును హరితమయం చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగేళ్లలో గ్రీన్‌వాల్‌గా మార్చారు.

నాలుగేళ్ల కృషికి నిదర్శనం...

అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేసిన మంత్రి హరీశ్​రావు.. 2016లో రాజీవ్ రహదారిపై హరితహారంలో భాగంగా మొక్కలు నాటించారు. రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు పెంచారు. సంరక్షణ బాధ్యతను స్థానిక పంచాయతీలకు, ఉపాధి హమీ విభాగానికి అప్పగించారు. ఏదైనా మొక్క చనిపోతే.. మరో మొక్కను నాటి సంరక్షించారు. నాలుగేళ్లలో మొక్కలు.. చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం రాజీవ్ రహదారికి రెండువైపుల కిలోమీటరుకు 800 చెట్లు ఉండగా... రోడ్డు మధ్యలో రంగు రంగుల పూల మొక్కలు 200లకు పైగా ఉన్నాయి. ఇలా రెండు వైపులా కలిపి 184 కిలోమీటర్ల పచ్చనితోరణం రహదారిపై ఆవిష్కృతమైంది.

ఆహ్లాదం పంచుచున్న ప్రయాణమార్గం...

రాజీవ్ రహదారిని గ్రీన్ వాల్​గా మార్చడంలో ఉపాధి హమీ పథకాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. మొక్కలు నాటడం నుంచి సంరక్షణ వరకు.. రోడ్డు పక్కల పెరిగే పిచ్చి మొక్కలు, పొదల తొలగింపు వంటి పనులను కూలీలతో చేయించారు. దీని వల్ల ఉపాధితో పాటు రోడ్డు హరితమయమైంది. ఇలా ఈ మార్గంలో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ప్రయాణికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలతో వార్తాల్లో నిలిచే రాజీవ్ రహదారి.. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో పచ్చదనంతో కొత్త అనుభూతులను పంచుతోంది. హరితస్ఫూర్తిని రగిలిగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీచూడండి: ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.