మాజీమంత్రి ఈటల రాజేందర్ శామీర్పేటలోని ఆయన నివాసం నుంచి మాజీ ఎంపీ వివేక్, స్వామిగౌడ్తో కలిసి హుజురాబాద్ బయలుదేరి వెళ్లారు. భాజపాలో చేరిన తరువాత తొలిసారి ఈటల హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. కాట్రపల్లిలో భాజపాలో చేరనున్న పలువురు నేతలు, కార్యకర్తలు... ఈటలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. 4 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్న ఆయన నేడు నాగారంలో పర్యటించనున్నారు.
హుజూరాబాద్కు వెళ్తున్న ఈటలకు ప్రజ్ఞాపూర్ వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి గజ్వేల్తో తనకు ఎంతో అనుబంధం ఉందని... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో తప్పకుండా భాజపా జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి: kaleshwaram: గాయత్రి పంప్హౌజ్ నుంచి కాళేశ్వరం జలాలు ఎత్తపోత