సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చుపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నదాతలకు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సేంద్రియ పద్దతిలో సాగుచేస్తున్న 200 మంది రైతులకు... పాడి పశువులను పంపిణీ చేశారు. బెల్గావ్ ఆర్మీ డైరీ నుంచి 270 ఆవులను తెప్పించి... డ్రా ద్వారా అన్నదాతలకు అందించారు. సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించిన వారిని ఆయన సన్మానించారు. ప్రతి గ్రామానికి పశువైద్య సహాయకుడిని నియమించి... ఆవుల ఆరోగ్యాన్ని పరిశీలించాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న హరీశ్రావు తదనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తామని రైతులకు హామీనిచ్చారు.
ఇవీ చూడండి: సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి