అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువులోకి చేపపిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి ఉచితంగా చేపపిల్లలను విడుదల చేస్తున్నామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని ప్రతాప్ అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్, జడ్పీటీసీ సభ్యులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి పోరాటం ఒక్కరిది... విజయం దివ్యాంగులందరిదీ