ETV Bharat / state

బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కందిరైతుల ఆందోళన - బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కందిరైతుల ఆందోళన

సిద్దిపేట జిల్లా బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కంది రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.

farmers-protest-in-bejjanki-agricultural-market-in-siddipet-district
బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కందిరైతుల ఆందోళన
author img

By

Published : Feb 15, 2020, 8:08 PM IST

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​లో పీఏసీఎస్, మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో జనవరిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.5800 చొప్పున మద్దతు ధరతో ఇప్పటివరకు 34 మంది రైతుల నుంచి సుమారు 338 క్వింటాళ్ల కందులను కొనుగోళ్లు చేశారు. తేమ, నాణ్యత నిబంధనలతో కొనుగోళ్లు మందగించాయి. సమీప గ్రామాల నుంచి కందులను విక్రయించడానికి వస్తున్న రైతులకు నిరీక్షణ తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్​లైన్​లో నమోదు చేసుకున్న రైతుల కందులే కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయని సిబ్బంది తెలపడంతో రైతులు ఆందోళన చేశారు. ఖరీఫ్ ఆరంభంలో రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసినా... సగానికిపైగా పేరు లేకపోవడం సమస్యగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కందిరైతుల ఆందోళన

ఇవీ చూడండి: తినేదానికంటే నేలపాలయ్యే ఆహారమే ఎక్కువ!

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​లో పీఏసీఎస్, మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో జనవరిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.5800 చొప్పున మద్దతు ధరతో ఇప్పటివరకు 34 మంది రైతుల నుంచి సుమారు 338 క్వింటాళ్ల కందులను కొనుగోళ్లు చేశారు. తేమ, నాణ్యత నిబంధనలతో కొనుగోళ్లు మందగించాయి. సమీప గ్రామాల నుంచి కందులను విక్రయించడానికి వస్తున్న రైతులకు నిరీక్షణ తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్​లైన్​లో నమోదు చేసుకున్న రైతుల కందులే కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయని సిబ్బంది తెలపడంతో రైతులు ఆందోళన చేశారు. ఖరీఫ్ ఆరంభంలో రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసినా... సగానికిపైగా పేరు లేకపోవడం సమస్యగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెజ్జంకి వ్యవసాయ మార్కెట్​లో కందిరైతుల ఆందోళన

ఇవీ చూడండి: తినేదానికంటే నేలపాలయ్యే ఆహారమే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.