ETV Bharat / state

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 19, 2020, 8:31 PM IST

Updated : Jul 19, 2020, 9:19 PM IST

corona-positive-for-husnabad-mla-satish-kumar
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్

20:29 July 19

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. తన సమీప బంధువుకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హన్మకొండలోని తన ఇంటికి పిలిపించారు. తానూ కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, పరీక్షల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పీఎ తెలిపారు. సతీష్ కుమార్ వారం రోజుల క్రితం హైదరాబాద్​కు వెళ్లి రావడంతోపాటు, గత గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ప్రస్తుతం ఎమ్మెల్యే హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అందరూ హోం క్వారంటైన్​లోనే ఉన్నారు. ఆయన ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చింది. కానీ సతీష్ కుమార్​కు పాజిటివ్ వచ్చిన విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించ లేదు. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులు మాత్రం కరోనా నిర్ధరణ అయినట్లు.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

20:29 July 19

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. తన సమీప బంధువుకు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హన్మకొండలోని తన ఇంటికి పిలిపించారు. తానూ కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, పరీక్షల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్​కు పాజిటివ్ వచ్చినట్లు ఎమ్మెల్యే పీఎ తెలిపారు. సతీష్ కుమార్ వారం రోజుల క్రితం హైదరాబాద్​కు వెళ్లి రావడంతోపాటు, గత గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ప్రస్తుతం ఎమ్మెల్యే హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అందరూ హోం క్వారంటైన్​లోనే ఉన్నారు. ఆయన ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చింది. కానీ సతీష్ కుమార్​కు పాజిటివ్ వచ్చిన విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించ లేదు. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులు మాత్రం కరోనా నిర్ధరణ అయినట్లు.. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

Last Updated : Jul 19, 2020, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.