ETV Bharat / state

'కాకితో కబురు పంపినా... చర్చలకు సిద్ధం...' - TSRTC STRIKE UPDATES

ఆర్టీసీ కార్మికుల సమ్మె 41 వ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా... హుస్నాబాద్​లో నిర్వహించిన ర్యాలీలో చాడ వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. కార్మికులకు రెండు నెలలుగా జీతాలులేక బాధపడుతున్నారని... పలు దుకాణాల్లో చాడా బిక్షాటన చేశారు.

CHADA VENKATREDDY BEGGING FOR TSRTC EMPLOYEES IN HUSNABAD
author img

By

Published : Nov 14, 2019, 3:16 PM IST

Updated : Nov 14, 2019, 11:34 PM IST

కాకితో కబురు పంపినా ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్​ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో చాడ పాల్గొన్నారు. చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ... చౌరస్తాలోని పలు దుకాణాలలో భిక్షాటన చేశారు. వచ్చిన డబ్బులను కార్మికులకు అందించారు. ఈరోజు చనిపోయిన కార్మికుడికి నివాళులర్పించారు. 28 మంది కార్మికులు చనిపోయినా... సీఎం కేసీఆర్​కు కనికరం లేదని చాడ మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 48 వేల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకోని సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు సమ్మెలో ఉద్ధృతంగా పాల్గొంటామని చాడ వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.

'కాకితో కబురు పంపినా... చర్చలకు సిద్ధం...'

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

కాకితో కబురు పంపినా ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్​ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో చాడ పాల్గొన్నారు. చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ... చౌరస్తాలోని పలు దుకాణాలలో భిక్షాటన చేశారు. వచ్చిన డబ్బులను కార్మికులకు అందించారు. ఈరోజు చనిపోయిన కార్మికుడికి నివాళులర్పించారు. 28 మంది కార్మికులు చనిపోయినా... సీఎం కేసీఆర్​కు కనికరం లేదని చాడ మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 48 వేల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకోని సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు సమ్మెలో ఉద్ధృతంగా పాల్గొంటామని చాడ వెంకట్​రెడ్డి స్పష్టం చేశారు.

'కాకితో కబురు పంపినా... చర్చలకు సిద్ధం...'

ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్​నోట్​ కాదు... తెరాసకు మరణ శాసనం'

Intro:TG_KRN_101_14_RTC KARMIKULA SAMME_BJP MADHATHU_AVB_TS10085
REPORTER:KAMALAKAR9441842417
---------------------------------------------------
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా హుస్నాబాద్ ఆర్టీసి డిపో ఎదుట ఆందోళన చేసిన కార్మికులు గాంధీ చౌరస్తా మీదుగా నెహ్రూ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.ఈ ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు నరోత్తం రెడ్డి పాల్గొని ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులతో నరోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్న ప్రభుత్వం చెలించడం లేదని, తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో 30 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం విషయంలో కృషి చేసిన ఘనతను తెరాస ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వారిపై కఠిన వైఖరిని అనుసరించడం ఖండిస్తున్నామన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మెకు భాజపా మద్దతు ఉంటుందని తెలిపారు.Body:బైట్

1) సిద్దిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు
నరోత్తం రెడ్డి Conclusion:హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా మద్దతు
Last Updated : Nov 14, 2019, 11:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.