ETV Bharat / state

ORGANS DONATION: కుమారుడు బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసిన తల్లిదండ్రులు

author img

By

Published : Apr 28, 2022, 8:54 PM IST

ORGANS DONATION: అవయవదానం చేయడమంటే మరొకరికి ప్రాణం పోయడమే కాదు.. ఓ కుటుంబానికే వెలుగునివ్వడం. మనవల్ల వేరొకరి జీవితాల్లో వెలుగు నిండితే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. ఇదే విషయంలో ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానానికి ముందుకొచ్చారు. మరో ముగ్గురికి ప్రాణాలు నిలిపారు.

ORGANS DONATION
జీవన్ దాన్ సంస్థకు అవయవాల దానం

ORGANS DONATION: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో తల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. మరో మూడు కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. అవయవదానంతో ఆ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ యాదయ్య తన మంచి మనసును చాటుకున్నారు.

ORGANS DONATION:
ప్రవీణ్​కు నివాళులు అర్పించిన గ్రామస్థులు

ఈనెల 14న యాదయ్య కుమారుడు ప్రవీణ్ వెళుతున్న ద్విచక్రవాహనాన్ని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రవీణ్​కు తీవ్రగాయాలు కావడంతో నానక్​రాం గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండురోజులు చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న జీవన్​దాన్ ప్రతినిధులు ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు అంగీకరించారు. అతని రెండు కిడ్నీలు, లివర్ ముగ్గురికి దానం చేశారు. అవయవ దానం చేసి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన యాదయ్య దంపతులను జీవన్​దాన్ సంస్థ సభ్యులు సత్కరించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ORGANS DONATION: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో తల్లిదండ్రులు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. మరో మూడు కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. అవయవదానంతో ఆ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ యాదయ్య తన మంచి మనసును చాటుకున్నారు.

ORGANS DONATION:
ప్రవీణ్​కు నివాళులు అర్పించిన గ్రామస్థులు

ఈనెల 14న యాదయ్య కుమారుడు ప్రవీణ్ వెళుతున్న ద్విచక్రవాహనాన్ని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రవీణ్​కు తీవ్రగాయాలు కావడంతో నానక్​రాం గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు. రెండురోజులు చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న జీవన్​దాన్ ప్రతినిధులు ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు అంగీకరించారు. అతని రెండు కిడ్నీలు, లివర్ ముగ్గురికి దానం చేశారు. అవయవ దానం చేసి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన యాదయ్య దంపతులను జీవన్​దాన్ సంస్థ సభ్యులు సత్కరించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఇవీ చూడండి:Heavy Rain: పలు జిల్లాల్లో అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​... మరో రెండు నోటిఫికేషన్లు వచ్చేశాయ్​

'పద్మశ్రీ'కి అవమానం.. నడిరోడ్డుపైకి 90 ఏళ్ల కళాకారుడు

తొమ్మిది మంది భార్యల ముద్దుల మొగుడు- ఆ పని​ కోసం 'టైమ్​ టేబుల్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.