రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా రాత్రి శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. ఈ వేడుక ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఆద్యంతం అందరిని ఆకట్టుకుంది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు.
ఇవీ చూడండి: 19న హైదరాబాద్లో వీర హనుమాన్ శోభాయాత్ర