రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి డివిజన్లోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల గృహాలు ఉండడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్లాస్టిక్ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల యాజమాన్య ఆగడాలు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : కూకట్పల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి