రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో అడ్డూ, అదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే కాలంలో ఇసుక మాఫియా నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. షాద్నగర్కు సమీపంలోనే రాజపూర్లో ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఫలితంగా ఇసుక మాఫియా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. నియోజకవర్గం పరిధిలో ఫరూఖ్నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట మండలాల్లో వాగులు ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా...
గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాగుల్లోంచి ఇసుక లారీలు, ఇతర వాహనాల ద్వారా అక్రమంగా బయటకు తరలిపోతోంది. ఏటా ఈ విషయంపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ.. అధికారులు స్పందించలేదు. తాజాగా పెరుగుతున్న ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాగుల్లో ఇసుక తరలింపు, ఇసుక నిల్వలపై చర్యల వంటి కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.
విస్త్రృతంగా తనిఖీలు...
కేశంపేట మండలంలో ఇసుక బట్టిలను ధ్వంసం చేసినా అధికారులు... తాజాగా తరలింపును అడ్డుకునేందుకు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాద్నగర్లో అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించడం వల్ల తమకు మేలు జరుగతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం