ETV Bharat / state

కొవిడ్​ మృతుల అంత్యక్రియలకోసం ప్రత్యేక బృందం

author img

By

Published : Apr 28, 2021, 12:33 PM IST

కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం చేయడానికి జల్పల్లి మున్సిపల్​ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మృతదేహాల ఖననం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

తెలంగాణ వార్తలు
రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్​ అధికారులు కరోనా మృతుల అంత్యక్రియలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్​తో చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యుల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న బృంద సభ్యులకు మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది... పీపీఈ కిట్లు, శానిటైజర్లు, తదితర సామగ్రి అందించారు. కొవిడ్​తో ఎవరైనా మరణిస్తే ఆందోళన చెందవద్దని.. అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 24 గంటలు ప్రత్యేక బృంద సభ్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్​ అధికారులు కరోనా మృతుల అంత్యక్రియలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్​తో చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబ సభ్యుల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అంత్యక్రియలు నిర్వహిస్తున్న బృంద సభ్యులకు మున్సిపల్​ ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది... పీపీఈ కిట్లు, శానిటైజర్లు, తదితర సామగ్రి అందించారు. కొవిడ్​తో ఎవరైనా మరణిస్తే ఆందోళన చెందవద్దని.. అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 24 గంటలు ప్రత్యేక బృంద సభ్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 8,061 కరోనా కేసులు, 56 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.