రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలో గత రాత్రి 3 ఇళ్లలో చొరబడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వేములవాడ పోలీసులు క్లూస్ టీంతో పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: మృత్యువుతో పోరాడి... చిన్నారి మృతి