రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రo నిర్వాహకులు మొక్కజొన్న ధాన్యం తూకం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి తీరా విక్రయించే సమయంలో వరుణుడు వర్షం రూపంలో నిండా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తూకం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: మిడతా.. మిడతా ఊచ్... వస్తే చంపేస్తామోచ్!