ETV Bharat / state

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jun 20, 2020, 11:53 PM IST

ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కోరారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Chopadandi MLA Sunke Ravi Shankar Awareness on Harithaharam Programme
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లిలో నిర్వహించిన హరితహారం సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రసంగించారు. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాటితే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. వృక్ష సంపద ఉంటేనే వర్షాలు బాగా కురిసి.. సమస్త జీవజాలం మనుగడ సాగిస్తాయని అన్నారు. జిల్లాలో బోయిన్​పల్లి మండలం మొక్కల పెంపకంలో మొదటి స్థానంలో నిలవాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లిలో నిర్వహించిన హరితహారం సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రసంగించారు. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాటితే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. వృక్ష సంపద ఉంటేనే వర్షాలు బాగా కురిసి.. సమస్త జీవజాలం మనుగడ సాగిస్తాయని అన్నారు. జిల్లాలో బోయిన్​పల్లి మండలం మొక్కల పెంపకంలో మొదటి స్థానంలో నిలవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.