పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను తెలంగాణ అడ్వంచర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త, రెస్క్యూ టీం కాపాడారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ... సివిల్స్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్తాపంతో గోదావరి నదిలోకి దూకింది. వెంటనే స్పందించిన రెస్క్యూటీం ఆమెను రక్షించారు.
విషయం తెలుసుకున్న అఖిల భారత గంగపుత్ర మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ సత్యం బెస్త, ప్రసన్న కుమార్ రక్షణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. మహాసభ తరఫున ప్రసన్న కుమార్ రెస్క్యూ టీంకు అభినందలు తెలిపారు.
ఇదీ చూడండి: కాసేపట్లో తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు