ETV Bharat / state

'లాక్​డౌన్​ అమలులో ప్రజల పాత్ర కీలకం'

author img

By

Published : Apr 16, 2020, 4:29 PM IST

నిజామాబాద్​ జిల్లాలో కొత్తగా నమోదైన 3 కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 58కి చేరుకున్నాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బోధన్​ పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను పరిశీలించారు.

nizamabad collector narayana reddy visited containment areas in bodhan
లాక్​డౌన్​ అమల్లో ప్రజల పాత్ర కీలకం

నిజామాబాద్​ జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి వైరస్​ను ఇంట్లోకి తీసుకెళ్లొద్దన్నారు.

బోధన్​ పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. కొత్తగా వచ్చిన 3 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 58కి చేరిందని తెలిపారు. రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తోన్న నగదు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద గుమిగూడొద్దని సూచించారు.

బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయడంలో ప్రజలపాత్ర కీలకమన్నారు.

నిజామాబాద్​ జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి వైరస్​ను ఇంట్లోకి తీసుకెళ్లొద్దన్నారు.

బోధన్​ పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. కొత్తగా వచ్చిన 3 కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 58కి చేరిందని తెలిపారు. రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తోన్న నగదు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద గుమిగూడొద్దని సూచించారు.

బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని, ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయడంలో ప్రజలపాత్ర కీలకమన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.