కరోనా మహమ్మారి వల్ల జీవనోపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నామని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా భయంతో ప్రయాణికులు ఆటోలు ఎక్కడం లేదని, తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ఐదు నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు.
ఓ వైపు కుటుంబ పోషణ, మరోవైపు ఆటో వాయిదా చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. వాయిదాలు చెల్లించడానికి ప్రభుత్వం సడలింపులు ఇవ్వాలని, తమకు ఆర్థికంగా కాస్త చేయూతనివ్వాలని బాల్కొండ ఆటో డ్రైవర్లు కోరారు.