ETV Bharat / state

హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి: డీసీఎంఎస్ ఛైర్మన్ మోహన్ - ఆరోవిడత హరితహారం కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని నిజామాబాద్​ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ సాంబరి మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాటే ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు.

6th-term-hariharam-programme-at-indalvai-in-nizamabad-district
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
author img

By

Published : Jun 25, 2020, 4:54 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని గన్నారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని డీసీఎంఎస్ ఛైర్మన్ సాంబరి మోహన్ ప్రారంభించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు... దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ సూచించారు. మొక్కలు నాటే పద్ధతిని ఎఫ్​ఆర్వో హిమచందన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీడీఓ రాములు నాయక్ హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలోని గన్నారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని డీసీఎంఎస్ ఛైర్మన్ సాంబరి మోహన్ ప్రారంభించారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు... దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ సూచించారు. మొక్కలు నాటే పద్ధతిని ఎఫ్​ఆర్వో హిమచందన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, ఎంపీడీఓ రాములు నాయక్ హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.