నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు పర్యటించారు. 14వ వార్డులోని నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అనంతరం గత కొన్ని రోజుల క్రితం అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన రాజు కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఆయన సీఎంకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ వారికి భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ లేఖ