నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మళ్లీ గుడుంబా అమ్మకాలు మొదలయ్యాయి. లాక్డౌన్ విధింపుతో మద్యం దుకాణాలు మూతపడటం వల్ల కొంతమంది నాటుసారా విక్రయాలు ప్రారంభించారు.
నాటుసారా కాచేందుకు హైదరాబాద్ నుంచి దేవరకొండకు నల్లబెల్లం, పట్టిక తీసుకెళ్తుండగా చింతపల్లి మండలం మాల్చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో 20 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పట్టిక దొరికిందని పోలీసు అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు.