నల్గొండ జిల్లా చండూరు మండలంలోని కస్థాలలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. చండూరు మండలంలోని దుబ్బగూడెం గ్రామం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఉపేందర్ తెలిపారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ