ETV Bharat / state

చేనేత కార్మికుల భిక్షాటన... ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి - నల్గొండ జిల్లా తాజా వార్తలు

కరోనా మహమ్మారి ప్రభావంతో నాలుగు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలోని చేనేత ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.

చేనేత కార్మికుల భిక్షాటన...కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
చేనేత కార్మికుల భిక్షాటన...కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
author img

By

Published : Jul 30, 2020, 3:23 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో చేనేత కార్మికులు భిక్షాటన చేశారు. కరోనా ప్రభావం వల్ల సుమారు నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం స్పందించి చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.

పనుల్లేక పస్తులండాల్సిన పరిస్థితి దాపరించిందని... రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కుటుంబాలకు ఆకలి కేకలే దిక్కయ్యాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కష్టకాలంలో చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని... జీఎస్టీని తొలగించి జీవన భృతి కల్పించాలని కోరారు.

నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో చేనేత కార్మికులు భిక్షాటన చేశారు. కరోనా ప్రభావం వల్ల సుమారు నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... ప్రభుత్వం స్పందించి చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు.

పనుల్లేక పస్తులండాల్సిన పరిస్థితి దాపరించిందని... రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కుటుంబాలకు ఆకలి కేకలే దిక్కయ్యాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కష్టకాలంలో చేనేత రంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని... జీఎస్టీని తొలగించి జీవన భృతి కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.