ETV Bharat / state

డీసీఎం బోల్తా... 12 మంది కూలీలకు గాయాలు - ACCIDENT NEWS IN NALGONDA

నల్గొండి జిల్లా కోతులారం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని హైదరాబాద్​ తరలించారు. కొత్తపేటలోని సాయిసంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది.

DCM ACCIDENT AT NALGONDA DISTRICT DAULY LABOURS INJURED
author img

By

Published : Nov 10, 2019, 10:28 PM IST

Updated : Nov 10, 2019, 10:48 PM IST

నల్గొండ ప్రమాద బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం...

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివేల, కోతులరాం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలో పత్తి నింపుకొని వస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్రవహానాన్ని తప్పించబోయి... బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 12 మంది కూలీలు గాయపడ్డారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా... హైదరాబాద్​కు తరలించారు. ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయ యాదయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. మిగతా వారి పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. కూలీలంతా కిష్టాపురం గ్రామానికి చెందిన రోజువారి కూలీలుగా గుర్తించారు. డ్రైవర్​ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.

ఇవీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

నల్గొండ ప్రమాద బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం...

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివేల, కోతులరాం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలో పత్తి నింపుకొని వస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్రవహానాన్ని తప్పించబోయి... బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 12 మంది కూలీలు గాయపడ్డారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా... హైదరాబాద్​కు తరలించారు. ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయ యాదయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. మిగతా వారి పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. కూలీలంతా కిష్టాపురం గ్రామానికి చెందిన రోజువారి కూలీలుగా గుర్తించారు. డ్రైవర్​ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.

ఇవీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి

Intro:TG_NLG_111_10_DCM_Bolatha_Av_Ts10102

ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో డిసియం బోల్తా కొట్టింది....

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివేల, కోతులరాం గ్రామాల మధ్యన అదుపు తప్పి పత్తి డిసియం బోల్తా.డిసియం లో ఉన్న 12మంది కూలీలు ఉండగా 12 మంది క్షతగాత్రులు అయ్యారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని హైదరాబాద్ సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది కి స్వల్పగాయాలు .వీరందిరిని హైదరాబాద్ సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు పరిస్థితి ఒక రోజు గడిస్తే గాని చెప్పలేం అంటున్న వైద్యులు .మరో ఎనిమిది కి స్వల్పగాయాలు వారు కూడా హైదరాబాద్ సాయిసంజీవని ఆసుపత్రిలో ఉన్నారు. వీరంతా పత్తి లోడ్ చేసే రోజు వారికూలీలు కిష్టాపురం గ్రామం .వీరు పత్తిని కొంపల్లి గ్రామంలో లో డిసియం లో లోడ్ చేసుకొని కోతులరాం నుండి పలివేల వైపు వెళుతుండగా కోతులరాం ,పలివేల గ్రామాల మధ్యన ములమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వహనంను తప్పించబోయి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బోయ యాదయ్య 46 తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉంది. మరియు బొంగు వెంకటయ్య 52 ,వడ్డేపల్లి పాపయ్య 65 ,నందీపాటి ఇస్తారికి తీవ్రగాయాలు ఒక రోజు గడిస్తే గాని చెప్పలేము అంటున్న వైద్యులు.8 మందికి స్వల్పగాయాలు (ప్రాణాపాయం ఎం లేదు) వీరు అదే గ్రామానికి చెందిన కదిరే లింగయ్యా కు రోజువారీగా పతిని లోడ్ చేసేందుకు వెళుతుండేవారని వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని చిన్న సన్నకారు రైతులు .వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
Last Updated : Nov 10, 2019, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.