పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్గొండ సమీపంలోని పన్నెండో పటాలం సిబ్బంది శాంతి ర్యాలీ నిర్వహించారు. పటాలం నుంచి అన్నెపర్తి వరకు ర్యాలీ కొనసాగించారు.
కమాండెంట్ ఎన్వీ సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వంద మంది సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అమరవీరుల సేవలను స్మరిస్తూ మొక్కలు నాటారు.
ఇవీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్