ETV Bharat / state

నాగర్​కర్నూల్​ ఎస్​బీఐ శాఖలో కరోనా కలకలం... సేవలు బంద్ - nagarkarnool district news

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నాగర్​కర్నూల్ ఎస్​బీఐ​లో కరోనా కలకలం రేపింది. వనపర్తికి చెందిన ఎస్​బీఐ అధికారి ఒకరు ఇటీవలే ఇక్కడకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఆయనకు కరోనా వచ్చింది. దీంతో నాగర్​కర్నూల్​ శాఖ అధికారులు ఆర్థిక లావాదేవీలను, బ్యాంకు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

corona fear in sbi branch in nagarkarnool
నాగర్​కర్నూల్​ ఎస్బీఐ శాఖలో కరోనా కలకలం
author img

By

Published : Jun 25, 2020, 4:25 PM IST

Updated : Jun 25, 2020, 9:03 PM IST

నాగర్​కర్నూల్​లోని ఎస్​బీఐలో కరోనా కలకలం రేపింది. దీంతో తాత్కాలికంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు సేవలను మూసివేశారు. వనపర్తి ఎస్​బీఐ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారికి బుధవారం కరోనా పాజిటివ్ అని తేలిందని ఎస్​బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు తెలిపారు. ఆ అధికారి ఇటీవలే నాగర్​కర్నూల్​ శాఖలో ఆడిట్ నిర్వహణలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించారని చెప్పారు. దీంతో బ్యాంకు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

అతడి నుంచి ఎవరికైనా ప్రైమరీ కాంటాక్ట్స్ ఏవైనా జరిగి ఉండవచ్చనే అనుమానంతో మెయిన్ బ్రాంచ్ ఆదేశాల మేరకు బ్యాంకు సిబ్బంది సేవలను తాత్కాలికంగా మూసివేశారు. పాజిటివ్ ఉన్న వ్యక్తి విధులు నిర్వహిస్తున్న వనపర్తి ఎస్​బీఐ శాఖల్లోని రెండు బ్రాంచీలు, నాగర్​కర్నూల్ బ్రాంచ్​ను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాంకులో ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఎలాంటివీ జరగడం లేదని... తిరిగి వైద్య శాఖ అధికారులు, తమ అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరుస్తామని ఎస్​బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు.

నాగర్​కర్నూల్​లోని ఎస్​బీఐలో కరోనా కలకలం రేపింది. దీంతో తాత్కాలికంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు సేవలను మూసివేశారు. వనపర్తి ఎస్​బీఐ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారికి బుధవారం కరోనా పాజిటివ్ అని తేలిందని ఎస్​బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు తెలిపారు. ఆ అధికారి ఇటీవలే నాగర్​కర్నూల్​ శాఖలో ఆడిట్ నిర్వహణలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించారని చెప్పారు. దీంతో బ్యాంకు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

అతడి నుంచి ఎవరికైనా ప్రైమరీ కాంటాక్ట్స్ ఏవైనా జరిగి ఉండవచ్చనే అనుమానంతో మెయిన్ బ్రాంచ్ ఆదేశాల మేరకు బ్యాంకు సిబ్బంది సేవలను తాత్కాలికంగా మూసివేశారు. పాజిటివ్ ఉన్న వ్యక్తి విధులు నిర్వహిస్తున్న వనపర్తి ఎస్​బీఐ శాఖల్లోని రెండు బ్రాంచీలు, నాగర్​కర్నూల్ బ్రాంచ్​ను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాంకులో ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఎలాంటివీ జరగడం లేదని... తిరిగి వైద్య శాఖ అధికారులు, తమ అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరుస్తామని ఎస్​బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..!

Last Updated : Jun 25, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.