ఇసుక పంపిణీ వివాదంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా నాగులపల్లి గ్రామంలో జరిగింది. నిందితులపై కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పికెట్ నిర్వహించారు.
జిల్లాలోని నాగులపల్లి గ్రామంలో చెలరేగిన ఇసుక పంపిణీ వివాదంలో ఒక వర్గం వారు మరో వర్గంవారిపై రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రత్యర్థుల ఇళ్లలోకి చొరబడిన కొందరు వ్యక్తులు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రాణ భయంతో మహిళలు బయటకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై ఓబుల్రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం.. ఇద్దరు మృతి