నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఎల్.శర్మన్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వార్డులో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7గంటల సమయంలో అదనపు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలోను వైద్యులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఆక్సిజన్ మానిటరింగ్ను అటెండర్స్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వారం పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన