మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని బాల నగర్ డీసీపీ పద్మజా అన్నారు. అల్వాల్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. పోలింగ్ బూత్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎన్నికలు సజావుగా సాగడానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. ఉదయం ఓటింగ్ మందకొడిగా సాగినప్పటికీ... ప్రస్తుతం ఊపందుకుందని అన్నారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: క్యూలైన్లలో ఓటర్ల బారులు... ఎండలో తప్పని తిప్పలు