మేడ్చల్ జిల్లా లాల్గాడిమలక్పేట గ్రామానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడిచేశారు. జహంగీర్ అలియాస్ జంగయ్య అనే వ్యక్తి భార్యతో మహేశ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో... గత రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడి జంగయ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్మెన్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కిడ్నాపర్ రవిశేఖర్పై పీడీ యాక్ట్ నమోదు