మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని కోరుతూ... కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల్లో ఓట్ల కోసం మూడు రోజులు మాత్రమే వెబ్సైట్ ఓపెన్ చేసి కొంత మందివి మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని... బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆరోపించారు.
అర్హులైైన ప్రతి ఒక్కరికీ పింఛన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే దుబ్బాక ఉప ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల కార్మికులతో తెరాసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించాారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రం అందజేశారు.
![పింఛన్ ఇవ్వకుంటే ఉపఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-41-19-bedi-karmikuka-darna-citu-avb-5s10115_19102020135918_1910f_01160_848.jpg)
ఇదీ చూడండి: ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్