రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.
సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ ఛైర్మన్గా పనిచేసిన ముత్యం రెడ్డి... ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఆదర్శవంతమైన నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి: హరీశ్ రావు