ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం

మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి చెందారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు.

author img

By

Published : May 3, 2021, 1:54 PM IST

CM KCR mourns
former MLA Muthyam Reddy death

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు.

సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ ఛైర్మన్​గా పనిచేసిన ముత్యం రెడ్డి... ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఆదర్శవంతమైన నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు.

సొంత జిల్లా నేతగా రాజకీయాల్లో తనతో పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ ఛైర్మన్​గా పనిచేసిన ముత్యం రెడ్డి... ఒక సందర్భంలో తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా ఆదర్శవంతమైన నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. ముత్యంరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి: హరీశ్‌ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.