మెదక్ జిల్లాలో ప్రదేశిక ఎన్నికలకు అభ్యర్థుల ప్రచార జోరును పెంచారు. హవేలీ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని కుంచన్పల్లి గ్రామ తెరాస అభ్యర్థి షేర్ నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అందుకే ప్రజలంతా కారు వైపే ఉన్నారన్నారు. అలాగే హావేలి, ఘనాపూర్ మండలం భాజపా జడ్పీటీసీ అభ్యర్థి రేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి లింగాల భూదేవి హవేలీ ఘన్పూర్ మండలంలో ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మన్ బట్టి జగపతి తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'బాలికల అదృశ్యం కేసులను పునర్ విచారణ చేయాలి'