ETV Bharat / state

నేరేడ్​ మెట్​ ఎస్సైపై రాచకొండ కమిషనర్​కు ఓ వ్యక్తి ఫిర్యాదు - నేరేడ్మెట్​ ఎస్సైపై రాచకొండ కమిషనర్​కు ఓ వ్యక్తి ఫిర్యాదు

మేడ్చల్​ జిల్లా నేరేడ్​ మెట్​ ఎస్సై సైదులుపై ముత్యాలు అనే వ్యక్తి రాజకొండ కమిషనర్​ మహేశ్​ భగవత్​కు ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా తనపై దాడికి దిగారని ఆరోపించారు.

One person complains to the Commissioner of Rachakonda against Naredmet SI
నేరేడ్మెట్​ ఎస్సైపై రాచకొండ కమిషనర్​కు ఓ వ్యక్తి ఫిర్యాదు
author img

By

Published : Jan 5, 2020, 8:38 PM IST

Updated : Jan 5, 2020, 8:44 PM IST


మేడ్చల్​ జిల్లా నేరేడ్​ మెట్​ ​ భార్యభర్తల మధ్య జరిగిన కొట్లాట పోలీస్​స్టేషన్​కి చేరింది. పిలిచి కౌన్సిలింగ్​ చేయాల్సిన పోలీసులు భర్త ముత్యాలును లాఠీతో విపరీతంగా కొట్టడం వల్ల చేతులపై, కాళ్లపై వాతలు పడి నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు.

నేరేడ్మెట్​ ఎస్సైపై రాచకొండ కమిషనర్​కు ఓ వ్యక్తి ఫిర్యాదు

లాఠీ విరిగేలా కొట్టాడు..

నేరేడ్​ మెట్​ అంతయ్య కాలనీలో నివసించే ముత్యాలు ఒక ప్రైవేటు ఉద్యోగి. నిన్న రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో భార్య కూకట్​పల్లిలో ఉండే వాల్ల తమ్ముడికి ఫోన్​ చేసి చెప్పింది. అతను ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి తనపై దాడి చేసి... వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు వాపోయాడు. పోలీసులు వచ్చి ముత్యాలును స్టేషన్​కి తీసుకెళ్లారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై సైదులు తనను ఏమి అడగకుండానే ఎటువంటి విచారణ జరపకుండానే... రాత్రి 11.30 గంటల సమయంలో లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితుడు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ సైదులుపై రాచకొండ కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చూడండి: ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!


మేడ్చల్​ జిల్లా నేరేడ్​ మెట్​ ​ భార్యభర్తల మధ్య జరిగిన కొట్లాట పోలీస్​స్టేషన్​కి చేరింది. పిలిచి కౌన్సిలింగ్​ చేయాల్సిన పోలీసులు భర్త ముత్యాలును లాఠీతో విపరీతంగా కొట్టడం వల్ల చేతులపై, కాళ్లపై వాతలు పడి నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు.

నేరేడ్మెట్​ ఎస్సైపై రాచకొండ కమిషనర్​కు ఓ వ్యక్తి ఫిర్యాదు

లాఠీ విరిగేలా కొట్టాడు..

నేరేడ్​ మెట్​ అంతయ్య కాలనీలో నివసించే ముత్యాలు ఒక ప్రైవేటు ఉద్యోగి. నిన్న రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరగడంతో భార్య కూకట్​పల్లిలో ఉండే వాల్ల తమ్ముడికి ఫోన్​ చేసి చెప్పింది. అతను ఇద్దరు మిత్రులతో కలిసి వచ్చి తనపై దాడి చేసి... వాళ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు వాపోయాడు. పోలీసులు వచ్చి ముత్యాలును స్టేషన్​కి తీసుకెళ్లారు. నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సై సైదులు తనను ఏమి అడగకుండానే ఎటువంటి విచారణ జరపకుండానే... రాత్రి 11.30 గంటల సమయంలో లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితుడు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ సైదులుపై రాచకొండ కమిషనర్​కు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చూడండి: ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!

sample description
Last Updated : Jan 5, 2020, 8:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.