మహబూబ్నగర్ డీసీసీబీ ఛైర్మన్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మక్తల్కు చెందిన నిజాంపాషా, వైస్ఛైర్మన్గా మహబూబ్నగర్కు చెందిన కోరమోని వెంకటయ్యను ఎంపిక చేస్తూ... అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు నిజాంపాషా, కోరమోని వెంకటయ్య నామపత్రాలు దాఖలు చేశారు.
మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఛైర్మన్గా ప్రభాకర్ రెడ్డి, వైస్ఛైర్మన్గా హర్యానాయక్ పేర్లు అధిష్ఠానం ఖరారు చేసింది. అధిష్టానం నిర్ణయాలను మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ఎన్నికైన డైరెక్టర్లకు వివరించారు. ఒక్కో పదవికి ఒక్కరే నామినేషన్లు దాఖలు చేయటం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.
నిన్నటి వరకూ ఛైర్మన్ పదవి కోసం విష్ణువర్ధన్ రెడ్డి, జక్కా రఘనందన్ రెడ్డి సహా పలువులు తీవ్రంగా ప్రయత్నించినా... అధిష్టానం మాత్రం కొత్త వ్యక్తుల వైపు మొగ్గు చూపి అందరి అంచనాలు తారుమారు చేసింది.