కొవిడ్ను అరికట్టడానికి ఎవరైతే కృషి చేశారో వారికి ముందుగా వ్యాక్సిన్ను ఇవ్వాలని నిర్ణయించినట్లు గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కొవిడ్ వాక్సినేషన్ సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పది నెలల కష్టం రేపటితో తీరబోతోందని మంత్రి అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నాలుగు సెంటర్లలో వ్యాక్సిన్ను ప్రారంభిస్తున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ సమీక్షలో కలెక్టర్ గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, డాక్టర్ శ్రీరామ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పంచాయతీల ప్రగతిపై సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు'