ETV Bharat / state

'సర్పంచ్​పై చర్యలు తీసుకోండి'

దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామ పంచాయతీలో అవినీతి జరుగుతోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. విచారణ చేపట్టి సర్పంచ్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. వాటర్​ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు.

author img

By

Published : Feb 8, 2021, 3:21 PM IST

man protested on a water tank, demanding an inquiry into corruption in the gram panchayat office in mahabubabad
'సర్పంచ్​పై చర్యలు తీసుకోండి'

గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి, సర్పంచ్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఓ వ్యక్తి వాటర్​ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని రామానుజపురంలో చోటుచేసుకుంది.

స్థానికుడు యాకయ్య.. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్​ను, సర్పంచ్​ తన సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించాడు. గ్రామ పంచాయతీ నిధులు, ఖర్చు వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్​ చేశారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి, సర్పంచ్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఓ వ్యక్తి వాటర్​ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని రామానుజపురంలో చోటుచేసుకుంది.

స్థానికుడు యాకయ్య.. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్​ను, సర్పంచ్​ తన సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించాడు. గ్రామ పంచాయతీ నిధులు, ఖర్చు వివరాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.