రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించిన మాహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ విజ్డం స్కూల్లో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
తాను నాటి మొక్క సంరక్షణ బాధ్యతను ఓ ఉపాద్యాయుడికి అప్పగించానని చెప్పారు. ఆ మొక్కకు పుట్టినరోజు వేడుక చేస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ ఒక్కో మొక్క నాటి అడవుల శాతాన్ని పెంచుదామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండీ: హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎక్సైజ్ సూపరింటెండెంట్