ETV Bharat / state

పత్తి రైతుల తిప్పలు.. - cotton farmers suffer with problems in mahabubabad

ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు సకాలంలో పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల మిల్లు వద్దే రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్నీ రోజులు ఈ తిప్పలు అంటూ మహబూబాబాద్ జిల్లా పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

cotton farmers suffer with problems in mahabubabad
పత్తి రైతుల తిప్పలు..
author img

By

Published : Dec 5, 2019, 9:02 AM IST

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం శివారులోని కాటన్ మిల్లులో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మద్దతు ధరను పొందేందుకు వివిధ మండలాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నారు. పత్తిని సకాలంలో కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో తీసుకువచ్చిన పత్తిని విక్రయించేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల రాజ్యం

కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద దళారుల రాజ్యం నడుస్తోందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పత్తి రైతుల తిప్పలు..

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం శివారులోని కాటన్ మిల్లులో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మద్దతు ధరను పొందేందుకు వివిధ మండలాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నారు. పత్తిని సకాలంలో కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో తీసుకువచ్చిన పత్తిని విక్రయించేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల రాజ్యం

కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద దళారుల రాజ్యం నడుస్తోందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పత్తి రైతుల తిప్పలు..

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:TG_WGL_26_04_PATTHI_RAITHULA_NEREEKSHANA_AB_TS10114
....... ....... ....
జీ వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
...... ...... ...... .... ...
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు సకాలంలో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో మిల్లు వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రం వద్ద కనీసం మౌలిక వసతులు కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం శివారులోని కాటన్ మిల్లు లో ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గత నెల 13న పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందేందుకు వివిధ మండలాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నారు. పత్తిని సకాలంలో కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో తీసుకువచ్చిన పత్తిని విక్రయించేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు విమర్శిస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస మౌలిక వసతులు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలో తరలివచ్చిన వాహనాలను ప్రధాన రహదారి వెంట నిలపడం తో బారులుతీరి కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రం వద్ద దళారుల రాజ్యం నడుస్తోందని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయడం లేదని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్ద రోజుల తరబడి నిరీక్షించడం తో సమయం వృధా అవుతుందని వాహనదారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పత్తిని తీసుకు వచ్చిన రైతులకు సీసీఐ అధికారులు తేమ పేరుతో పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తారని దీంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిని సకాలంలో కొనుగోలు చేసి ఇబ్బందులు పడకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బైట్స్......
1. పూజారి జనార్ధన్ రైతు నిదానపురం
2. పెరుమాండ్ల వెంకన్న రైతు నెల్లికుదురు
3. మంగీలాల్ టాటా ఏసీ డ్రైవర్ అనే పురం తొర్రూర్
4. శ్రీను టాటా ఏసీ డ్రైవర్ గుండం రాజు పల్లి
5. శేరి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నేత పెద్ద నాగారం
6. చందర్రావు తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి


Body:TG_WGL_26_04_PATTHI_RAITHULA_NEREEKSHANA_AB_TS10114


Conclusion:TG_WGL_26_04_PATTHI_RAITHULA_NEREEKSHANA_AB_TS10114
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.