ETV Bharat / state

శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం - BIG FIRE ACCIDENT IN COLD STORAGE

ఆరుగాలం శ్రమించి పండించి... అమ్ముకునేందుకు నిల్వ ఉంచిన పంటలు కళ్ల ముందే బూడిదయ్యాయి. లాభాలు తెచ్చిపెడతాయని ఆశించిన రైతన్నను అగ్ని ప్రమాదం దెబ్బతీసింది. మహబూబాబాద్​లోని ఓ శీతల గిడ్డంగిలో ఉదయం చెలరేగిన మంటలు రాత్రి వరకు అదుపులోకి రాకపోవటం వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది.

BIG FIRE ACCIDENT IN COLD STORAGE
author img

By

Published : Jul 25, 2019, 6:10 AM IST

శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం
మహబూబాబాద్​లోని అనంతారం సమీపంలో గల శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 11 గంటలకు గిడ్డంగిలోని ఏ-బ్లాక్​ నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన చేరుకున్న సిబ్బంది.. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరిపెడ, నర్సంపేట, ఇల్లెందు, వరంగల్ నుంచి మరో 5 అగ్నిమాపక వాహనాలు రప్పించి... గోడలను పగలకొట్టి మరీ మంటలను ఆర్పేందుకు యత్నించారు. హైదరాబాద్​ నుంచి మరో 2 వాహనాలను రప్పించి మంటలు ఆర్పారు.

సుమారు రూ.25 కోట్లు నష్టం...

గిడ్డంగిలోని ఏ, బీ బ్లాక్​లలో ఉన్న సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. బీ, సీ బ్లాక్​లలో ఉన్న బస్తాలను అందుబాటులో ఉన్న రైతులు వాహనాలలో ఇతర ప్రాంతాలకు తరలించారు. మిర్చి ఘాటుతో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులలో ఒకరైన శ్రీనివాస్ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదంలో సుమారు రూ.25 కోట్ల నష్టం సంభవించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఆందోళనలో రైతులు...

నిల్వ చేసుకున్న పంటలకు ఇన్సూరెన్స్​ వస్తుందని... రైతులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని నిర్వాహకులు ధైర్యం చెబుతున్నారు. తాము నిల్వ చేసుకునే సమయంలో ఉన్న ధరతో సంబంధం లేకుండా ప్రస్తుత ధరతోనే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల భరోసా...

కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ , డీఎస్ రెడ్యానాయక్, హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?

శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం
మహబూబాబాద్​లోని అనంతారం సమీపంలో గల శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 11 గంటలకు గిడ్డంగిలోని ఏ-బ్లాక్​ నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన చేరుకున్న సిబ్బంది.. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరిపెడ, నర్సంపేట, ఇల్లెందు, వరంగల్ నుంచి మరో 5 అగ్నిమాపక వాహనాలు రప్పించి... గోడలను పగలకొట్టి మరీ మంటలను ఆర్పేందుకు యత్నించారు. హైదరాబాద్​ నుంచి మరో 2 వాహనాలను రప్పించి మంటలు ఆర్పారు.

సుమారు రూ.25 కోట్లు నష్టం...

గిడ్డంగిలోని ఏ, బీ బ్లాక్​లలో ఉన్న సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. బీ, సీ బ్లాక్​లలో ఉన్న బస్తాలను అందుబాటులో ఉన్న రైతులు వాహనాలలో ఇతర ప్రాంతాలకు తరలించారు. మిర్చి ఘాటుతో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులలో ఒకరైన శ్రీనివాస్ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదంలో సుమారు రూ.25 కోట్ల నష్టం సంభవించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఆందోళనలో రైతులు...

నిల్వ చేసుకున్న పంటలకు ఇన్సూరెన్స్​ వస్తుందని... రైతులు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని నిర్వాహకులు ధైర్యం చెబుతున్నారు. తాము నిల్వ చేసుకునే సమయంలో ఉన్న ధరతో సంబంధం లేకుండా ప్రస్తుత ధరతోనే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల భరోసా...

కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ , డీఎస్ రెడ్యానాయక్, హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?

Intro:Tg_wgl_21_25_cold_storage_Fire_pkg_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
( ) మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని అనంతారం సమీపంలో గల శీతల గిడ్డంగి లో బుధవారం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది.రాత్రి వరకు కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో హైదరాబాద్ నుండి మరో రెండు అగ్నిమాపక వాహనాలను రప్పిస్తున్నారు. మిర్చి,పసుపు, అపరాలు , చింతపండు అగ్నికి ఆహుతయ్యాయి.ఈ సంఘటనలో సుమారు 25 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు.
VO:1: ఉదయం 11 గంటలకు శీతల గిడ్డంగి లోని A బ్లాక్ లో నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో మరిపెడ,నర్సంపేట ఇల్లందు వరంగల్ ,నుండి 5 అగ్నిమాపక వాహనాలు రప్పించి శీతల గిడ్డంగి గోడలను పగలకొట్టి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో, హైదరాబాద్ నుండి మరో రెండు పెద్ద అగ్నిమాపక వాహనాలను రప్పిస్తున్నారు. శీతల గిడ్డంగి లో ఫైర్ సేఫ్టీ ఉన్నా, ఈ సంఘటన చోటు చేసుకోవడం మంటలు అదుపులోకి రాకపోవడం అర్థం కాని విషయం గా మారింది.A.B బ్లాక్ లలో ఉన్న సరుకులు అన్నీ అగ్ని కి ఆహుతి కాగా,B ,C బ్లాక్ లలో ఉన్న బస్తాలను అందుబాటులో ఉన్న రైతులు వాహనాల లో ఇతర ప్రాంతాలకు తరలించారు. ఘాటు బాగా ఉండడంతో చాలా సేపు అక్కడ ఉండే పరిస్థితి కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నిర్వాహకులలో ఒకరైన శ్రీనివాస్ అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు.
VO:2: శీతల గిడ్డంగి లోని 4 బ్లాక్ లలో నిల్వ సామర్థ్యం ఒక లక్షా 20 వేల బస్తాలు. సరైన ధర లేకపోవడంతో రైతులు తాము పండించిన మిర్చి పసుపు అపరాలను శీతల గిడ్డంగి లో నిల్వ చేసుకున్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇన్సూరెన్స్ వస్తుందని నిర్వాహకులు తెలుపుతున్నా, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తాము నిల్వ చేసుకునే సమయంలో ఉన్న ధరతో సంబంధం లేకుండా ప్రస్తుత ధరతో నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
VO:3: కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ , డీఎస్ రెడ్యానాయక్ హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. మంటలను ఆర్పేందుకు అధికారులకు అవసరమైన ఏర్పాట్లను చేస్తాం అని కలెక్టర్ తెలిపారు.
End voice : ఏది ఏమైనా మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా శీతల గిడ్డంగుల యజమానులు అధికారులు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
బైట్స్
1.అభిషేక్..... శీతల గిడ్డంగి నిర్వాహకులు
2.బిక్షా నాయక్....రైతు
3.శివలింగయ్య....కలెక్టర్, మహబూబాబాద్.




Body:నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ మీ ఇచ్చారు


Conclusion:9394450198

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.