ETV Bharat / state

రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి

author img

By

Published : May 19, 2019, 11:57 PM IST

వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన కుమురంభీం జిల్లాలోని కాగజ్​నగర్​ సమీపంలో జరిగింది.

రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి

సికింద్రాబాద్ నుంచి దర్బంగా వైపు వెళ్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు ఇద్దరు జారిపడి మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ కాగజ్​నగర్​ సమీపంలో చోటుచేసుకుంది. రాలపేట, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో గల 207 కిలోమీటర్ రాయి వద్ద రైలు బోగి ద్వారం వద్ద కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారిపోయాడు. ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి జారిపడ్డాడు. ఇద్దరూ మృతి చెందారు. బాలుడు ఈర్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ధర్మేంద్ర ఉరవన్​గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు తెలియలేదని మృతుడి వయసు 55 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి

ఇవీ చూడండి: బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు

సికింద్రాబాద్ నుంచి దర్బంగా వైపు వెళ్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు ఇద్దరు జారిపడి మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ కాగజ్​నగర్​ సమీపంలో చోటుచేసుకుంది. రాలపేట, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో గల 207 కిలోమీటర్ రాయి వద్ద రైలు బోగి ద్వారం వద్ద కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారిపోయాడు. ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి జారిపడ్డాడు. ఇద్దరూ మృతి చెందారు. బాలుడు ఈర్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ధర్మేంద్ర ఉరవన్​గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు తెలియలేదని మృతుడి వయసు 55 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి

ఇవీ చూడండి: బొలెరో వాహనం బోల్తా.. ముగ్గురికి గాయాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.